కుబేర - కథ - కథనం - విశ్లేషణ





కుబేర - కథ - కథనం - విశ్లేషణ

తన 25 ఇయర్స్ సినిమా కెరీర్ లో తీసింది 10 సినిమాలే అయినప్పటికీ తనదైన ముద్ర వేసుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు. అయన సినిమాల్లో పాత్రలు సహజంగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఎలాంటి అతి ప్రయోగాలు లేకుండా, మనసుకు హత్తుకునేలా ఉంటాయి. అయన కథల్లో పెద్ద పెద్ద ట్విస్టులు, యాక్షన్ సీన్లు ఉండవు. కానీ జీవితంలోని చిన్న చిన్న సందర్భాలు, భావోద్వేగాలు ద్వారా ప్రేక్షకుల మనసు గెలుచుకుంటారు. శేఖర్ కమ్ముల సినిమా అనేది కథ కంటే అనుభూతి ఎక్కువగా ఉండే ప్రయాణం. ధనుష్ నటన అంటే సహజత్వానికి పరాకాష్ఠ. భావోద్వేగాలను చక్కగా పలికించగల నైపుణ్యం అతనికి ఉంది. ఎమోషన్ అయినా అతని చూపుల్లో కనిపిస్తుంది, సాధారణమైన పాత్రలను అసాధారణంగా జీవించగల నటుడు. నాగార్జున గారు తన నటనా ప్రయాణంలో పలు ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ తన విశిష్టతను నిరూపించుకున్నారు. శేఖర్ కమ్ముల + ధనుష్ + నాగార్జున అనే అనిర్వచనీయ కాంబినేషన్ నుంచి, సాధారణ ప్రేక్షకులు ఆశించేది ఒక భావోద్వేగాల కలయిక, సహజమైన కథనం, అందమైన పాటలు మరియు అద్భుత నటన. శేఖర్ కమ్ముల గారి సున్నితమైన కథలు, జీవితం తాలూకు నైజాన్ని హత్తుకునేలా చెప్పే శైలిదీనికి ధనుష్ సహజమైన నటన మరియు నాగార్జున గారి హుందాతనంతో కూడిన వయస్సును మించిన గ్రేస్ కలిస్తేఒక నూతన సినిమాటిక్ అనుభూతి అవుతుంది అని ఆశించటం - అంచనాలు పెట్టు కోవటం తప్పు కాదు. మరి అన్ని అంచనాల మధ్య రిలీజ్ అయిన "కుబేర" ఎంత వరకు వాటిని అందుకుంది? కలెక్షన్స్ - సక్సెస్ మీట్స్ పక్కన పెట్టి సినిమా కలిగించిన అనుభూతిని విశ్లేషించుకునే ప్రయత్నమే ఆర్టికల్.


"సినిమా చూడని వాళ్ళుచూడాలి అనుకునే వాళ్ళు ఇది చదవక పోవటమే మంచిదిఅని నా అభిప్రాయంఇది కేవలం నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తో రాస్తున్నది అని గమనించగలరు

 

కథ: సారాంశం: ఇది ఎవరి పాయింట్ అఫ్ వ్యూ లో చెప్పాల్సిన కథ ? ఒక ధనవంతుడు - ఒక బిచ్చగాడు, వేర్వేరు లోకాలు, వేర్వేరు జీవితాలు, కోరుకున్నదల్ల నాది అనే ఒకరు - బతుకు కొరకే బతుకు నాది అనుకునే ఇంకొకరు. ఎవరి కథలోకి ఎవరు వస్తారు? వాళ్ళని కలిపింది ఎవరు? ఎందుకు కలపాల్సి వచ్చింది? వాళ్ళు పేస్ చేసిన ప్రాబ్లెమ్ ఏంటి? చివరికి ఏమయ్యారు ? 

 

హీరో ధనుష్ గారు కాబట్టి అయన పాయింట్ అఫ్ వ్యూ లోనే చెప్పుకుంటే, ఒక బిచ్చగాడి జీవితం లో ఊహించని మార్పు, ఎదో మంచి జరగబోతుంది అనుకునే టైం కి, తన జీవితం లో వచ్చిన మార్పు వెనక ఉన్న ఆశయం - అత్యాశ గురుంచి తెలుసుకొని, ఎదురు తిరిగి పోరాడి సాధించిన గెలుపు.

 

అసలు విలన్ లేకపోతే కథ లేదు కాబట్టి అయన పాయింట్ అఫ్ వ్యూలో చెప్పుకుంటే, అత్యాశ కలిగిన ఒక కోటీశ్వరుడు కి మనీ లాండరింగ్ కోసం కొందరు బిచ్చగాళ్ళు అవసరం అయితే, అందులో ఒకడు పది వేల కోట్లు తో పారిపోతే? డబ్బు పోయినా పర్లేదు వాడి అంతు చూడాల్సిందే అని బయల్దేరి వాడి చేతిలోనే ముగిసిపోయిన ఒక పాత్ర కథ. అబ్బే అసలు ఇది కథ ఏంటండీ, ఇలాంటి కథ ఎక్కడ ఐన ఉంటుందా? కథ ఉండదు, కానీ పాత్ర ఉంటుంది. పాత్ర చుట్టూ అల్లుకున్న కథనం ఇలాగె ఉంటుంది. అసలు కథ కి మూలకారణం ఐన పాత్ర తన గొయ్యి తానే తవ్వుకుని ఇలాంటి బుర్ర తక్కువ పనులు చెయ్యకండ్రా అని ఇచ్చే సందేశం ఉంటుంది.


సినిమాలో నాగార్జున గారు ఉన్నారు కదా, ఆయన్ని ఇగ్నోర్ చేస్తూ కథ ఏంటి అసలు ? ఆయనకి ఎం చెప్పి ఒప్పించారు ? సినిమా అంతా అయన చుట్టూనే తిరుగుతుంది అంట కదా? అనగనగ ఒక నిజాయితీ పరుడైన సిబిఐ ఆఫీసర్, పెద్దవాళ్ళతో పెట్టుకొని చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూ, ప్రభుత్వం పైన, చట్టం పైన నమ్మకాన్ని కోల్పోయి, తప్పించుకోడానికి ఒక తప్పు చెయ్యటానికి ఒప్పుకొని రిలీజ్ అయ్యి, చేస్తుంది తప్పు అని రియలైజ్ అయ్యి, మంచి పక్కన నిల్చొని - ఏ ఫ్యామిలీ కోసం అయితే జైలు నుంచి బయటికి వద్దాం అనుకున్నాడో వాళ్ళని కూడా వదిలేసుకొని  - బిచ్చగాడికోసం ప్రాణాలర్పిస్తాడు. టైపు చేస్తున్న నాకే కళ్ళల్లో నీళ్లు తిరిగే అంత ఆర్ద్రత ఉన్న పాత్ర అని చదువుతున్న మీకు కూడా అర్ధం అయిపోయింది కాబట్టి ఇంకా అసలు విషయానికి వద్దాం.


ఇంటర్నేషనల్ క్రష్ రష్మిక గారు కూడా ఉన్నారండోయ్ సినిమాలో - ఆవిడ గురుంచి ఇక్కడే చెప్పేసుకుంటే మరి లాస్ట్ వరకు చదవటానికి ఎం ఉండదు కాబట్టి ఇక్కడ ఆపేసి అక్కడ చెప్పుకుందాం.


ఎవరో ఒకరి పాయింట్ అఫ్ వ్యూ లో చెప్పటానికి ఇది ఎవరి సినిమా కాదు, ఇది ఓన్లీ శేఖర్ కమ్ముల సినిమా అంతే, ఇది శేఖర్ గారి మాయాబజార్ అన్నారొక పెద్దాయన కాబట్టి పైన చెప్పుకున్న మూడు పక్కన పెట్టేసి మళ్ళీ కథ ఏంటో చెప్పుకుందాం. 

 

తిరిగి తిరిగి మళ్ళీ అదే  చెప్తున్నారు ఏంటి అనుకోకండి, సినిమా చూస్తున్నంత సేపు మనకి కూడా అక్కడికక్కడే తిరుగుతూన్న ఫీలింగ్ ఎందుకు వస్తుంది అంటే పైన చెప్పుకున్నట్టు ఎవరో ఒకరి వెర్షన్ లో కథని బలంగా తీసుకెళ్లకుండా అందర్నీ కలపాల్సిన థ్రెడ్ బలంగా అల్లుకోలేని కథనం వలన అని నా అభిప్రాయం, ఏది ఎలా అంటే? బలం గా అల్లుకోక పోవటం అంటే, మన సౌకర్యం కోసం మనకి కావాల్సినట్టుగా సినిమాటిక్ లిబర్టీస్ ని తీసేసుకొని మనకి నచ్చినట్టుగా తీసుకుంటూ పోతే మూడు గంటలు ఎం ఖర్మ, మూడు పార్ట్ లు కూడా తీయవచ్చు, కానీ చెప్పాలి అనుకున్నది ఎంత సూటిగా స్పష్టంగా చెప్పం అనేదే ఇంపార్టెంట్.


కథనం - ప్రారంభం : ప్రపంచం లో ఎక్కడ లేని ప్యూర్ ఆయిల్ / గ్యాస్ రిజర్వు ప్రభుత్వ పరిశోధనలో వ్వదొరుకుతుంది, దాని మీద కుబేరుడు నీరజ్ మోజు పడతాడు. (14 ట్రిలియన్ క్యూబిక్ టన్నులు ఆయిల్ పడింది అన్నప్పుడే అర్ధం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే నీరజ్ అనే వాడికి ఆయిల్ గురుంచి ఎం తెలియదు అని. ఐతే బారెల్స్, క్యూబిక్ మీటర్, లీటర్స్, మెట్రిక్ టన్నులు ఇలా ఏమైనా వాడొచ్చు కానీ క్యూబిక్ టన్నులు ఆయిల్ ఉండదు అన్న విషయం నీరజ్ కి, అయన తండ్రికి, మినిస్టర్స్ కి అసలు దాని గురుంచి ఐడియా లేదు అని చెప్పే సెటైర్ అన్నమాట) ప్రపంచ కుబేరుడు అవ్వాలి అనేది అతని ఆశయం. ప్రభుత్వ పెద్దలతో బేరం కుదుర్చుకుంటాడు, లక్ష కోట్లు లంచం ఇవ్వటానికి డీల్.

 

ఇంత పెద్ద డీల్ చెయ్యాలి అంటే నమ్మకం అయిన వ్యక్తి కావాలి, నమ్మకం అయిన వ్యక్తి అంటే మన ఇంట్లో పని చేసే వాడో, మన కోసం పని చేసే వాడో, మన కిందన పని చేస్తున్న కొన్ని లక్షల మందిలో, మనకి ఉన్న ఇన్ని కంపెనీస్ లో ఎవడో ఒకడు కూడా కాదు, ఒకప్పుడు మన మీద రైడ్ చేసిన సిన్సియర్ సిబిఐ ఆఫీసర్ ఒకడున్నాడు, 1000 కేసు లు సాల్వ్ చేసాడు, అని నాగార్జున గారిని ఎంచుకుంటారు. అయన ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి జైలు లో ఉన్నాడు. ఆయన్ని కలిస్తే నాకు చట్టం మీద నమ్మకం ఉంది, తప్పుడు పనులు చెయ్యను, నేను బయటికి వచ్చేస్తాను అంటాడు. కానీ అనుకోకుండా జడ్జి గారు 7 ఇయర్స్ శిక్ష వేస్తారు. 5 అయిపోయాయి ఇంకో 2 ఇయర్స్ ఉండటం కంటే, పై కోర్ట్ కి వెళ్లి ఫైట్ చెయ్యటం కంటే, తప్పుడు పనులు చెయ్యటమే బెటర్ అని నాగార్జున గారు డిసైడ్ అవుతారు. తనకి న్యాయం మీద నమ్మకం పోయింది, ఫామిలీ కోసం ఏం చెయ్యటానికిగా డిసైడ్ అయిపోయి బయటికి వచ్చేస్తాడు. అసైన్మెంట్ ఏంటో చెప్తారు, ఎందుకు ఏమిటి ఎలా అని అడగకూడదు అని కండిషన్ పెడతారు, మాములుగా మంచోడు కాబట్టి తాను కూడా ఎందుకు ఏమిటి అని తెలుసుకోవాలి అనుకోడు, అందులోను సిబిఐ ఆఫీసర్ కాబట్టి తనకి ఇది ఏంటో తెలుసుకోవటం అస్సలు జరిగే పనే కాదు. సిబిఐ ఆఫీసర్ కాబట్టి వెంటనే బినామీ పేరు మీద ఎలా డబ్బులు ట్రాస్న్ఫర్ చెయ్యాలి అనేది కుబేరుడు అయిన నీరజ్ కి డీటెయిల్ గా ఎక్సప్లయిన్ చేస్తాడు. రోడ్ పక్కన అడుక్కునే బిచ్చగాడిని చూడగానే ఐడియా వచ్చి, అసైన్మెంట్ కి బిచ్చగాళ్ళని ఎంచుకుంటారు. ఇండియా మొత్తం వడపోచి నాలుగు లొకేషన్స్ నుంచి నలుగురు బిచ్చగాళ్ళని ఎంచుకుంటారు, ఎందుకు ఏమిటి అని నాగ్ సర్ కాదు మనం కూడా అడగకూడదు. అలాంటి ఒక బిచ్చగాడు ధనుష్. చిన్నప్పుడే తల్లి చనిపోతే, వేరే దారిలేక, ఎన్నో చేతులు మారి ఫైనల్ గా తిరుపతి లో అడుక్కుంటూ ఉంటాడు. తన పని తనది, బ్రతకటం కోసమే బ్రతకాలి అనేది తన ఫిలాసఫీఊడ్చే పని వచ్చు, డాన్సులు వచ్చు, ఫైట్ లు వచ్చు, ఉన్నోళ్ళల్లో మంచి తెలివైన వాడు, బోలెడు మెమరీ ఉంది, ఎన్ని టాలెంట్స్ ఉన్నా అడుక్కోవటం లో నే జీవితం ఉంది పాపం తనకి. 


నలుగుర్ని తీసుకొచ్చి, ఒకే దగ్గర ఉంచి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఇంత సీక్రెట్ మిషన్ లో కూడా వాళ్ళకి నీరజ్ ని పరిచయం చేసి, వాళ్ళకి బ్యాంకు అకౌంట్స్ ఓపెన్ చేసి, వాళ్ళ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయించుకుని, ఒక్కొక్కరిని చంపెయ్యటం మొదలు పెడతారు. విషయం తెలిసినా కూడా నాగ్ సర్ ఏమి చేయలేని స్టేజి లో ఉంటాడు, అసలే CBI ఆఫీసర్ కాబట్టి, మిషన్ అయ్యాక నన్ను చంపేస్తారేమో అని భయం కూడా ఉండదు, ఫ్యామిలీ కి ఏమైనా అవుతుంది ఏమో అన్న అనుమానం కూడా రాదు. సిన్సియర్ గా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అక్కడ కడుపుతో ఉన్న ఒక అమ్మాయితో తప్పుగా ప్రవర్తించిన ఒకడి గురుంచి అందరు కంప్లైంట్ చేస్తుంటే, మనకి బిచ్చగాళ్ళు ఇంపార్టెంట్ కొన్ని రోజులు వీడిని తప్పించేద్దాం అని కూడా ఆలోచించుకుండా వాడితోనే మాటలు పడతాడు.  ఇంతలో ధనుష్ ని తీసుకెళ్లి ఒక రిజిస్ట్రేషన్ చేస్తాడు, తనతోనే దగ్గరుండి లంచం డబ్బులు ఇప్పిస్తాడు (ఇవన్నీ స్క్రీన్ ప్లే కన్వీనియెన్స్ కోసం రాసుకున్నవే, అవన్నీ జరగాల్సిన అవసరం లేదు, కానీ అలా జరగక పోతే సెకండ్ హాఫ్ లో ఒక మంచి ఎపిసోడ్ కి పే ఆఫ్ ఉండదు. సో ఇక్కడ ఈ ప్లాంటింగ్ అవసరం) ట్రాన్స్ఫర్ కూడా చేయించేసి చంపేద్దాం అనుకునే టైం కి, ఆన్లైన్ లావాదేవీ ఫెయిల్ అవ్వటం ధనుష్ తప్పించుకోవటం ఒకే సారి జరుగుతాయి.

 

మిడిల్ : సమస్యాత్మకం : సినిమా మొదలు అయిన గంట తర్వాత అసలు సిసలైన సమస్య వచ్చి పడింది అన్నమాట. 10000 కోట్లు అకౌంట్ లో ఉన్న ఒక బిచ్చగాడు తప్పించుకున్నాడు. అంత పెద్ద మహానగరం వాడిని పట్టుకోవటం ఎలా? వాడు డైరెక్ట్ గా ప్రెస్ కో మీడియా కో వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి ? ఎంత లేదు అన్నా ఇక్కడ ఎదో జరుగుతుంది, మనతో వచ్చినవాళ్లు కనిపించకుండా పోతున్నారు, కడుపుతో ఉన్న అమ్మాయి మీద ఇంత అన్యాయం చేస్తున్నారు, నాగ్ సర్ కి తెలిసిన తెలియక పోయినా మనం ఎదో ఒకటి చెయ్యాలి అని ధనుష్ కూడా ఫీల్ అవ్వడు. ఇంటర్వెల్ అనుకునే టైం కి ఫస్ట్ ప్లాట్ పాయింట్ వచ్చినట్టు.

 

ఉపకథ : ఇక్కడ రష్మిక పాత్రని ప్రవేశ పెట్టారు. కథలో మలుపు ఏమైనా వస్తుందా ? రాదు. కథని ముందుకి తీసుకెళ్తుందా ? వెళ్ళదు. మరి ఏం చేస్తుంది, జస్ట్ నాగ్ సర్ కి ఫోన్ చెయ్యటానికి తన ఫోన్ ఇవ్వటం తప్ప చేసింది ఏం ఉండదు.    అలాగే ధనుష్ తో పాటు క్లైమాక్స్ వరకు ఉంటుంది అంతే. రష్మిక వెనక తిరిగి తిరిగి మళ్ళీ తాను ఉన్న చోటుకు వచ్చి నాగ్ సర్ మంచోడు కాదు అని తెలుసుకొని మళ్ళీ పారిపోతాడు ధనుష్. అప్పుడు ఇంటర్వెల్. మధ్యలో ఉన్న మొత్తం లేపేసినా కథ లో వచ్చే ప్రాబ్లెమ్ ఉండదు. ఇంటర్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసేలా చేసిన మొత్తం అరగంట అప్పటి వరకు ఉన్న ఇంటరెస్ట్ ని సడలించేస్తుంది. ఒక రెండు రోజులు రోడ్ మీద తిరిగి ఫైనల్ గా నాగ్ ని కలుద్దాం అనుకునే టైం కి నాగ్ సర్ రోబో తో ఉండటం చూసి అన్ని తెలిసే ఈయన ఇలా చేస్తున్నాడు అని తెలుసుకున్న సరిపోయేది. పోనీ ఫోన్ చేసి మరీ వెనక్కి వచ్చాడు, రోబో నువ్వు కనిపిస్తే ప్రాబ్లెమ్ అవుతుంది నేను హేండిల్ చేస్తాను అని మన సిబిఐ ఆఫీసర్ కూడా అనుకోడు. ఇలాంటి సిల్లీ సిట్యుయేషన్స్ అవాయిడ్ చేసి ఉండాల్సింది. ఫస్ట్ హాఫ్ కే ఎంతో సేపు పెద్ద సినిమా చూసేసిన ఫీలింగ్ కలుగుతుంది అంటే, రష్మిక మేడం వచ్చిన దగ్గర నుంచి ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ వరకు ఒక థ్రిల్లర్ లా కాకుండా ఫిల్లెర్ లా అనిపించటం వలెనే.


మిడిల్ : సమస్యాత్మకం : సెకండ్ హాఫ్ : పారిపోయాడు, మళ్ళీ వాడే వచ్చాడు, మళ్ళీ పారిపోయాడు. సారి ఇంక తిరిగి రాడు, అంటే సమస్య ఇంకా పెద్దది అయినట్టు. నీకు బిచ్చగాడు అంటే జాలి, కానీ వాడి మీద ఉన్న కన్సర్న్ నీకు ఫామిలీ మీద లేదు, నీ ఫామిలీ దగ్గరకి నిన్ను చేర్చిన నా మీద లేదు అని ఇంకో పక్క నీరజ్ కి కూడా కోపం వచ్చేసింది. నాగ్ సర్ చాలా పెద్ద సమస్య లో ఇరుక్కున్నారు. లాస్ట్ ఛాన్స్ ఎలా అయినా పట్టుకోవాల్సిందే. కానీ ఇక్కడ మనకి తెలియని ఇంకో విషయం ఏంటి అంటే, ఇంత రచ్చ జరుగుతుంది అయన సీక్రెట్ గా కుష్బూ ని దాచెయ్యటం. తనతో పాటు తన ఫామిలీ ని కూడా రిస్క్ లో పెట్టేసారు. ధనుష్ పారిపోయాడు, కుష్బూ మిస్ అయ్యింది, మరి నీరజ్ సర్ టీం కి కుష్బూ తప్పించుకోవటం కూడా రిస్క్ అనిపించలేదా?


వేట : ఫస్ట్ టైం పారిపోయినప్పుడు సిటీ లోనే వెతికారు, సారి తిరుపతి వరకు వెళ్లి పోతారు. తిరిగి మళ్ళీ రష్మిక దగ్గరకే వస్తారు. విషయం ప్రేక్షకులకి తెలిసి పాత్రలకి తెలియనప్పుడు ప్రేక్షకుల్లో ఒక ఆత్రుత ఉంటుంది. ఎలా తెలుసుకుంటాడు, ఎప్పుడు పట్టుకుంటాడు అని, అది కథనం లో ఉత్సాహం తీసుకురావటానికి ఉపయోగ పడుతుంది. కానీ ఇక్కడ ధనుష్ రష్మిక వెనకే తిరిగినట్టు కథనం కూడా అక్కడ అక్కడే తిరుగుతుంది. మనం చెప్పుకున్న పే ఆఫ్ టైం వరకు. అదే రిజిస్టర్ ఆఫీస్ కి తిరిగి వెళ్ళటం. అయన చనిపోయాడు అని తెలుసుకోవటం. షాయాజీ షిండే గారు రావటం. ధనుష్ కి తాను ఎంత పెద్ద ప్రాబ్లెమ్ లో ఉన్నాడో చెప్పటం ఇవన్నీ జరుగుతున్నప్పుడు, సమాంతరం గా నాగ్ సర్ వేట సీరియస్ గా నడిచి ఉంటె కథనం రక్తి కట్టించేది. ఫోకస్ ఇటు షిఫ్ట్ అయ్యిపోవటం వలన సీరియస్ గా థ్రిల్లింగ్ గా జరగాల్సిన వేట కాస్త నీరసం గా జరుగుతుంది.  అయిన నలుగురు బిచ్చగాళ్ళకి తీసుకొచ్చిన రోజే ట్రాకర్ పెట్టేస్తే ఇంత పెద్ద అసైన్మెంట్ లో ప్రాబ్లెమ్ వచ్చి ఉండేది కాదేమో, ఐడియా మన సిబిఐ ఆఫీసర్ కి కానీ, అపర కుబేరుడు కి కానీ రాకపోవటమే ఆశ్చర్యం. పారిపోయిన ధనుష్ కోసం వెతకటానికి, కంట్రోల్ రూమ్ లో సీసీటీవీ లు వాడాలి అని ఎవరికీ ఎందుకు అనిపించదు, పోలీస్ వ్యవస్థ కూడా మన చేతుల్లోనే, మీడియా కూడా మన చేతుల్లోనే.

 

రిజిస్ట్రార్ ఇంట్లో డబ్బులు బంగారం దొరికితే, పోలీస్ ఆఫీసర్ వెంటనే ఎవరికీ ఇన్ఫోర్మ్ చెయ్యకుండా వాటిని అక్కడే మళ్ళీ భద్రం గా ఉంచు తర్వాత నీకు రష్మిక తో వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది అని వదిలేసి నాగ్ చేతిలో చచ్చిపోతాడు. ఇప్పటి వరకు నువ్వు అన్ని తెలిసినా సైలెంట్ గా ఉన్న సెకండ్ హీరో అనుకున్నాను, ఇప్పుడు మర్డర్ చేసిన సెకండ్ విలన్ వి అని ధనుష్ నాగ్ సర్ గురుంచి తెలుసుకుంటాడు. నాగ్ సర్ కి కూడా నేను ఇలా బిహేవ్ చేస్తే నా ఫామిలీ ఆడియన్స్ ఏమైపోవాలి అని ఆలోచింది ఫామిలీ కి ఏమైపోయినా పర్లేదు అని వాళ్ళని దుబాయ్ పంపించేసి యుద్ధం చెయ్యటానికి సిద్ద పడతాడు. కానీ తనకి తెలియని విషయం కుష్బూ ని సేవ్ చేసినపుడే యుద్ధం మొదలు అయిపోయింది అని. సరేలెండి , ఇంత సేపు ఇదంతా జరుగుతుంది అసలు ప్లాన్ బి అనేది లేని అపర కుబేరుడు నీరజ్ సర్ ఏం చేస్తారు? పోతే పోయింది ముందు ఇంకో 10 ఎలాగోలా అడ్జస్ట్ చేసి ఇచ్చిన 90 % కి న్యాయం చేద్దాం అనుకోడు, ధనుష్ ని పట్టుకోవాల్సిందే అప్పటి వరకు మినిస్టర్స్ వెయిట్ చెయ్యాల్సిందే అని ఊరుకుంటాడు.

 

సంక్షోభం ఫర్ నీరజ్ అండ్ నాగ్ సర్:  తన దగ్గర డబ్బులు ఉంచే బిచ్చగాళ్ళకి అందరికి పంచొచ్చు అని ఒక ఆశ పుడుతుంది ధనుష్ కి, వెంటనే నాగ్ సర్ కి ఫోన్ చేసి నాకు డబ్బులు కావాలి, డబ్బులతో చెన్నై ముంబై హైదరాబాద్ లో బిచ్చగాళ్ళకి ఇల్లు, చదువు, మందులు అన్ని ఇస్తాను అంటాడు. అసలు నాకు డబ్బులు వద్దు, వాడిని మాత్రం చంపెయ్యాలి అని డిసైడ్ అవుతాడు నీరజ్, ఇదేదో ఇంటర్వెల్ లో నే డిసైడ్ అయిపోతే, కాంట్రాట్ పాటికి చేతికి వచ్చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయేది ఏమో. నాగ్ సర్ ని కిడ్నప్ చేసి అయన సెకండ్ విలన్ కాదు సెకండ్ హీరో నే అని తెలుసుకుంటాడు ధనుష్. దేశాన్ని ఇలా దోచేస్తారు అని నాకు ముందే తెలుసుంటే అసలు జైలు లో నే ఉండేవాడిని అని కామెడీ చేస్తారు నాగ్ సర్, అది అయన బయటికి వేసిన ఫస్ట్ మీటింగ్ లో నే తెలిసిపోయింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీరజ్ ని పట్టించేద్దాం నువ్వు సహాయం చెయ్ అని ఒక ప్రపోసల్ పెడతాడు, అయ్యో నేను డబ్బులు అందరికి పంచుదాం అనుకున్నానే, పోనిలే అది పక్కన పెట్టేద్దాం, నువ్వు నాకు కుష్బూ బ్రతికే ఉంది అని ప్రూవ్ చెయ్ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ధనుష్ ఒప్పుకుంటాడు.

 

సంక్షోభం ఫర్ ధనుష్: అందరి ఫోన్ లు ట్రాక్ చేసిన నాగ్ సర్ అయన ఫోన్ కూడా ట్రాక్ చేస్తారు ఏమో అని అనుకోకుండా ఆన్ లో పెట్టుకొని కుష్బూ దగ్గరకి వెళ్తాడు (ఈ తెలివి తో అయన కుష్బూ ని ఎలా సేవ్ చేసారో కానీ.), అక్కడికి వచ్చేసిన ఒక సైడ్ క్యారెక్టర్ చేతిలో చచ్చిపోతాడు. సెకండ్ హీరో నో సెకండ్ విలనా అని పక్కన పెడితే, పాత్ర ఒక బుద్ధిమంతుడైన మూర్కుడు అయినప్పుడు, ఎవర్ని నమ్మి ఇంత రిస్క్ తీసుకున్నాడో వాడి చేతిలో చచ్చిపోతే కనీసం సింపతీ అయినా ఉండేది. చనిపోయే ముందు నేను నీ అన్న ని అని ఎదో డైలాగ్ చెప్పించారు కానీ అది రిజిస్టర్ అయ్యే టైం లేదు ఎందుకంటే అక్కడ పురిటి నొప్పులు ప్రాధాన్యం అయ్యిపోయాయి.  ఒక పాత్ర ని చంపేసినప్పుడు అది కథలో ఒక ముఖ్యమైన మలుపుకి కారణం అయ్యి ఉండాలి లేదంటే కథని ముందుకి నడిపించేది అయ్యి ఉండాలి కాదు కూడదు అంటే కథ అక్కడితో అయిపోవాలి, నాగ్ సర్ చావు కి ఇవేవి లేక పోవటం సీన్ పండాల్సిన రేంజ్ లో పండలేదు అనే దానికి కారణాలు అయ్యి ఉండొచ్చు.

 

నాగ్ ని చంపేసిన తర్వాత ఏం జరిగి ఉండొచ్చు, నీరజ్ ఇంకో ఆప్షన్ పట్టుకొని బాలన్స్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసి, ఇంకో పక్కన ధనుష్ ని లేపేసి ప్రపంచ కుబేరుడు అయిపోయి ఉండొచ్చు. ధనుష్ విషయానికి వస్తే ఇప్పుడు నాగ్ సర్ కూడా లేరు, డబ్బులు ఎలా తీసుకోవాలో తెలియదు, నీరజ్ ని ఎలా పట్టించాలి తెలియదు. బాగ్ లో ఉన్న ప్రూఫ్స్ ఏంటో రష్మిక కి కూడా ఐడియా లేని సబ్జెక్టు, ఇంకో పక్క అప్పుడే పుట్టిన పసిబిడ్డ, ఎక్కడికి అని వెళ్ళాలి, ఎలా బ్రతకాలి? అసలు నేను ఎందుకు భయపడాలి, ఇప్పుడు నాగ్ సర్ కూడా లేరు కాబట్టి సోలో గా మెలిగిన హీరో నేనే కాబట్టి చావో రేవో తేల్చుకునే సరిపోద్ది అని డిసైడ్ అవుతాడు. 

 

3rd ఆక్ట్ : ముగింపు : ఇక్కడ వరకు అక్కడిఅక్కడే తిరుగుతూ ఎలాగోలా లాక్కొచ్చేసినా, ఇక మీదట ఏం చెయ్యాలి అనే విషయం అస్సలు ఐడియా లేనట్టు ఇగో సైడ్ వెళ్ళటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఒక గోడౌన్ లో ఉన్న నోట్ల కట్టలతో వేరే ఊరు కానీ దేశం కానీ పారిపోయి అక్కడ బిచ్చగాళ్ళకి పంచేసి తాను అడుక్కోవచ్చు, కానీ, నీరజ్ ఇంటి ముందు కుప్పలుగా పడేస్తాడు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయ్ అని బెదిరిస్తాడు. కానీ అవన్నీ తిరిగి ఇచ్చేస్తాను ఒక్క రోజు అడుక్కో అంటాడు. ఈగో సంతృప్తి పరుచుకోటానికి తప్ప ఎందుకు పనికొస్తుంది? దాని వలన నీరజ్ మారతాడు అని ఎలా అనుకుంటాం? ఒక వేళ నిజంగా ధనుష్ చెప్పినట్టు నీరజ్ చేసి ఉంటె ప్రూఫ్స్ అన్ని ఇచ్చేసి ఎక్కడికి వెళ్తాడు? ప్రూఫ్స్ ఇచ్చేస్తాను నాకు పది వేల కోట్లు ఇచ్చే అని ఏదైనా డీల్ చేసుకుంటాడు ఏమో అనుకుంటే, ఏవేవో కోరికలు కోరి ఇంక ప్రాణం మీదకి తెచ్చుకొని నీరజ్ ని చంపేస్తాడు. అయిన నీరజ్ లాంటి కుబేరుడు చచ్చిపోతే తర్వాత ఏం జరుగుతుంది ? పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తాయి? అయన తండ్రి మాత్రం ఎందుకు వదిలేస్తాడు ? స్విస్ బ్యాంకు అకౌంట్ లో ఉన్న డబ్బులు తీసుకోవటం ఎలా? వాటిని టచ్ చేస్తే, అటు వైపు వెళ్లాలని చూస్తే, నీరజ్ తండ్రికి దొరికిపోరా? అయన ఉన్నన్ని రోజులు పరిగెడుతూనే ఉండాలి ఏమో కదా? కథకి రకమైన ముగింపు అస్సలు ఊహించలేనిది. నీరజ్ ని ఎక్సపోజ్ చెయ్యటమే సరైన ముగింపు అవ్వదా? నీరజ్ అండ్ అయన తండ్రి జైలు కి పోతే, అప్పుడు ధనుష్ బాలన్స్ డబ్బులు పంచేసి హ్యాపీ గా మళ్ళీ అడుక్కోవచ్చు. ఇందులో ఉన్న మెయిన్ పాత్రలు అన్ని అంత మూర్ఖంగా ఎలా ఆలోచించగలిగాయి అనేది ఒక సామాన్యుడు కి కూడా అంతు చిక్కని రహస్యం. సొల్యూషన్ ఇవ్వలేని ఒక ప్రాబ్లెమ్ గురుంచి డిస్కస్ చేసి మాత్రం వదిలెయ్యటం వలన ఏం ఉపయోగం? హవాలా రూపం లో బ్లాక్ మనీ, లంచాల రూపం లో అందరు తినేస్తుంటే, దానితో ఎంతో మంది బిచ్చగాళ్ల లైఫ్ లు బాగు చెయ్యొచ్చు అని చెప్తే ఎవరు వింటారు? ఎవరివో డబ్బులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి అవి నావి, వాటిని నేను పంచేస్తా మా లైఫ్ లు బాగు చేసుకుంటా అంటే ఎందుకు ఒప్పుకుంటారు? అసలు ఫైనల్ గా ఏం చెప్పాలి అనుకున్నారు? ఒక్కొక్క పాత్ర ద్వారా ఏం తెలియజేయాలని అనుకున్నారు?


నీరజ్: బిచ్చగాళ్ళని అడ్డు పెట్టుకొని ప్రపంచ కుబేరుడు అవుదాం అనుకున్నాడో, అదే బిచ్చగాడి చేతిలో చచ్చిపోయాడు.

 

దీపక్: ఫ్యామిలీ కోసం తప్పు చేయటానికి రెడీ అయ్యి మరీ జైలు నుంచి బయటికి వచ్చాడు, ఫ్యామిలీ ని కూడా వదిలేసుకొని సైడ్ విలన్ చేతిలో చచ్చిపోయాడు.

 

దేవా: ఎవరో ఒకరి తెలివితక్కువతనంతో తన జీవితం లోకి అదృష్టం వచ్చినా, దానిని ఎలా వినియోగించాలో అర్ధంకాక, గొప్ప అవకాశం చేతులారా నాశనం చేసుకుని చివరికి హంతకుడిగా మారిపోయాడు.

 

రష్మిక మేడం: ఈవిడ గురుంచి మొదట్లో చెప్పుకోలేదు కదా మనం, ఇప్పుడు చెప్పుకుందాం, ప్రేమించి మోసపోయిన యువతి, ఊరిలో వాళ్ళు బిచ్చగాడితో లేచిపోయింది అనుకుంటుంటే ఇంటికి తిరిగి వెళ్లలేక, ఉద్యోగమో చూసుకొని తన కాళ్ళ మీద తాను నిలబడుతుంది అనుకుంటే, అదే పుకారు ని నిజం చేస్తూ ఫైనల్ గా ఊరివాళ్ల దృష్టిలో బిచ్చగాడితోనే లేచిపోయింది. మధ్యలో డబ్బులు కనిపించగానే ఒక సూట్ కేసు లో సర్దేసుకొని బయలేరడం హైలైట్. అసలు సినిమా కి హీరోయిన్ ఉండాలి అనే తప్ప కథలో అవసరం లేని పాత్ర, పాత్ర కి ఎంతో కొంత సబ్జెక్టు నాలెడ్జ్ అయిన పెట్టి ఉండాలి అప్పుడు దేవా పాత్ర ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఉపయోగ పడే పాత్ర అయ్యి ఉండేది. ఇప్పుడు ఏమో బిచ్చగాడి కూడా తిరగటం, ఎవరో కన్న బిడ్డని తల్లిలా సాకటం. ఒక ప్రేమికుడితో జీవితం పంచుకోవాలి అని లేచిపోయిన అమ్మాయి ఊహించే జీవితం ఇది అయితే కాదేమో?

 

చివరిగా : కథలో విషయం లేదా అంటే ఉంది, కథనం లో కూడా ఎంతో కొంత ఉత్సుకత కలిగించే అంశాలతో కూర్చోబెట్టినా కొంచెం సేపటికి ఎటు తీసుకెళ్ళలో తెలియక చివరికి ఏం చెయ్యాలో తోచక అయోమయంగా ముగించిన ఫిలింగ్ కలిగేలా చేసారు. దానికి తోడు మూడు గంటల సినిమా అవ్వటం వలన, థ్రిల్ ఫాక్టర్స్ తక్కువ ఉండటం వలన సాగతీసిన ఫీలింగ్ కలిగించారు. రష్మిక మేడం ఎంట్రీ దగ్గర డ్రాప్ అయిన టెంపో ఇంక కోలుకునట్టు అనిపించక అక్కడిక్కడే తిరుగుతూ ఇబ్బంది పెట్టించారు. సాంకేతికం గా బావుండటం, అద్భుతమైన నటన ఒక సారికి ఓకే అనిపించేలా చేసాయి.  


యావరేజ్గా అనిపించిన సినిమాకి మన ఓవర్సీస్ సోదరులకు వేరే వెర్షన్ ఏమైనా చూపించారా అనే రేంజ్ లో రివ్యూస్ రావటం, మన మెయిన్ మీడియా కూడా క్యారీ అవ్వటం బహుశా గ్రహాలు అనుకూలించటం అంటే ఇదేనేమో. వేరే కమర్షియల్ డైరెక్టర్ అయితే ఇంత డిస్కషన్ వేస్ట్ కానీ, కమ్ముల సర్ కాబట్టి మరీ అంత లాజిక్ లేకుండా ఎలా ముందుకు వెళ్ళారా అనేది తట్టక రాసుకున్న విశ్లేషణ మాత్రమే. అన్నిటికంటే పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే దేవా కానీ, తాత కానీ, మళ్ళీ జన్మ లో బిచ్చగాళ్ళు గా పుట్టకూడదు అని కోరుకుంటూ జన్మ లో ఇంకా ఎందుకు బిచ్చగాళ్ళు లా ఉండిపోయారు?

 

శేఖర్ కమ్ముల సర్ మ్యాజికల్ మూమెంట్స్ కొన్ని మాత్రం అద్భుతం:

 

ధనుష్ ఎంట్రీ ఎపిసోడ్ నుంచి స్మశానం సీన్ వరకు

ధనుష్ అండ్ నీరజ్ ఫస్ట్ మీటింగ్

పోయి రా సాంగ్ లీడ్ నుంచి సాంగ్ వరకు

కిడ్ తో నీరజ్ కి బిచ్ఛం వేయించటం


0 comments:

 

Labels

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views